NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు
    కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు

    Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

    ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మేళాకు చివరి నాటికి భక్తుల సంఖ్య 60 కోట్లు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

    వివాదాస్పద వీడియోలపై కేసు నమోదు

    కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలను విక్రయిస్తున్న రెండు సామాజిక మాధ్యమ ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    యూపీ పోలీసు అధికారులు ఈ విషయాన్ని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

    Details

     పోలీసుల ప్రకటన ప్రకారం 

    మహిళల గోప్యత, గౌరవాన్ని భంగపరచే ఈ వీడియోలను కొన్ని ఫ్లాట్‌ఫారమ్‌లు అప్‌లోడ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

    సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ దీనిని కనుగొని కోత్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలు అప్‌లోడ్ చేసిన ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి సమాచారం కోరారు.

    టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ఈ వీడియోలను విక్రయిస్తున్నట్లు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    కుంభమేళాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అక్రమ చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

    Details

    అంచనాలను మించి భక్తుల హాజరు

    జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా తొలుత 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసినా భక్తులు ఊహించని స్థాయిలో తరలివచ్చారు.

    జనవరి 29 (మౌని అమావాస్య)న 8 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు.

    మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది పుణ్యస్నానం చేశారు.

    జనవరి 30న 2 కోట్ల మందికి పైగా తరలి వచ్చారు.

    ఫిబ్రవరి 14 నాటికే భక్తుల సంఖ్య 50 కోట్ల మార్కును దాటగా, ప్రస్తుతం 55 కోట్లను చేరుకుంది.

    ఫిబ్రవరి 26నాటికి భక్తుల సంఖ్య 60 కోట్లకు చేరవచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహా కుంభమేళా భక్తుల సముపార్జనతో విశేషంగా ముందుకు సాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్

    ఉత్తర్‌ప్రదేశ్

    Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్'  భారతదేశం
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఇండియా
    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం భారతదేశం
    Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025