NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ
    తదుపరి వార్తా కథనం
    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ

    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    12:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ సినీనటి జయసుధ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు.

    ఈ మేరకు మంగళవారం దిల్లీకి పయనమయ్యారు. బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలోకి చేరనున్నారు.

    కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు.

    భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు ఇటీవలే తమ పార్టీలోకి రావాలని జయసుధను కోరారు. దీంతో జయసుధ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి గెలుపొందారు.

    ఈ మేరకు 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో విజయం సాధించేందుకు క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా మారాయని గతంలో చర్చ జరిగింది.

    DETAILS

    మళ్లీ అదే ఫార్ములాతో బరిలోకి దిగనున్న జయసుధ

    మరోసారి సేమ్ ఫార్మూలాతో జయసుధను బరిలోకి దించాలని దిల్లీ కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచే మళ్లీ పోటీ చేయాలని జయసుధ భావిస్తున్నారు. ముషీరాబాద్, ఉప్పల్ పేరు వినికిడిలో ఉంది.

    త్వరలోనే ఈ మేరకు పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాషాయ కండువా కప్పుకున్నాక అమిత్ షాతో భేటీ కానున్నారు.

    ఈ ఏడాది చివర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థుల కోసం భాజపా సన్నద్ధమవుతోంది.

    ఏపీ విభజన తర్వాత 2016లో నవ్యాంధ్రప్రదేశ్ స్థాపన కోసమే తెలుగుదేశంలో చేరినట్లు జయసుధ పేర్కొన్నారు. అనంతరం 2019లో వైసీపీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని జయసుధ కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    తెలంగాణ
    సికింద్రాబాద్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    బీజేపీ

    జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలకు అవకాశం భారతదేశం
    అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి ఎమ్మెల్యే

    తెలంగాణ

    కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    నీటిపారుదల శాఖలో లష్కర్లు,  5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్ ప్రభుత్వం
    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ భారీ వర్షాలు
    తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్​ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర ఎమ్మెల్యే

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025