LOADING...
Gujarat: సూరత్‌లో సంచలనం.. రూ.25 కోట్ల వజ్రాలు దోపిడీ
సూరత్‌లో సంచలనం.. రూ.25 కోట్ల వజ్రాలు దోపిడీ

Gujarat: సూరత్‌లో సంచలనం.. రూ.25 కోట్ల వజ్రాలు దోపిడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లో భారీ దొంగతనం సంచలనం రేపింది. సూరత్‌లోని డీకే అండ్ సన్స్ కంపెనీ నుండి దాదాపు రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ సంఘటనపై సోమవారం కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం, సూరత్ కపొద్రాలో ఉన్న డీకే అండ్ సన్స్ పాలిషింగ్, ఎగుమతి యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో మెటల్ సేఫ్‌ను తెరిచి వజ్రాలను దోచుకెళ్లారని, అంతేకాకుండా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) అలోక్ కుమార్ తెలిపారు.

Details

దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి పండుగల నేపథ్యంలో కంపెనీ మూడు రోజుల సెలవు ప్రకటించింది. ఈ సమయంలో ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం దొంగలకు అవకాశం కల్పించింది. వారు ముందుగా కంపెనీ భవనం గ్రౌండ్ ఫ్లోర్ ప్రధాన ద్వారం పగలగొట్టి, ఆపై మూడో అంతస్తులోని సేఫ్ గదిలోకి ప్రవేశించారు. అక్కడ గ్యాస్ కట్టర్‌తో సేఫ్‌ను కత్తిరించి, వజ్రాలను అపహరించారని అలోక్ కుమార్ వెల్లడించారు. సెలవులు ముగిసిన తర్వాత కంపెనీ యజమాని ఆఫీసుకు వెళ్లి పరిస్థితిని గమనించగా, దొంగతనం జరిగిన విషయం బయటపడింది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.