NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
    ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!

    Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 30, 2025
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.

    రైల్వే అధికారుల ప్రకారం, ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద జరిగింది.

    అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు.

    పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్‌లు అని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు.

    Details

    రైళ్ల రూట్ల మార్పు

    ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల మార్గాలను మార్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

    ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు కొన్ని రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని తెలిపారు.

    ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది. దిగ్విజయ్ ప్రాంతానికి సంబంధించి 8991124238 నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

    Details

     ఓడిశాలో తరచూ రైలు ప్రమాదాలు 

    కొంతకాలంగా ఓడిశాలో రైలు ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

    శాలిమార్-చెన్నై కొరొమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు.

    అంతకుముందు 2022లో కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    ఒడిశా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    రైలు ప్రమాదం

    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి  పాకిస్థాన్
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు

    ఒడిశా

    Nayagarh: ఒడిశాలోని నయాగఢ్‌లో మరో రామమందిరం  భారతదేశం
    దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?  నవీన్ పట్నాయక్
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు ఆంధ్రప్రదేశ్
    Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025