NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్‌ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్‌ వార్నింగ్!
    తదుపరి వార్తా కథనం
    Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్‌ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్‌ వార్నింగ్!
    రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్‌ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్‌ వార్నింగ్!

    Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్‌ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్‌ వార్నింగ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 28, 2025
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

    వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాల్సిన విధంగా బిల్లులో వీటిని కలిపివేయడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది.

    రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానం కిందకి వస్తుందని పేర్కొంది.

    సర్వీస్ ఛార్జీలను చెల్లించాలా, వద్దా అనే విషయాన్ని పూర్తిగా వినియోగదారుల విచక్షణకే వదిలేయాలని సూచించింది.

    ఈ విధంగా అదనపు ఛార్జీలను విధిస్తున్న హోటళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA)కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

    Details

    వినియోగదారులపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీల భారం

    గతంలో సర్వీస్ ఛార్జీలను నిషేధిస్తూ ఈ సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారెంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

    ఇప్పటికే 2017లో కేంద్ర ప్రభుత్వం హోటళ్లలో వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పన్నుల పరిధిలోకి రావని ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం తప్పని స్పష్టం చేసింది.

    ఈ రుసుము పూర్తిగా వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు తెలియజేస్తూ, అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని ఆదేశాలిచ్చింది.

    మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హైకోర్టు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    దిల్లీ

    RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు ఆర్ఎస్ఎస్
    Delhi New CM: ఫిబ్రవరి 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం  బీజేపీ
    Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం అశ్విని వైష్ణవ్

    హైకోర్టు

    YS Avinash Reddy bail: ఎంపీ అవినాష్ బెయిల్ పై వాదనలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు   భారతదేశం
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన  కేంద్ర ప్రభుత్వం
    Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది  కర్ణాటక
    Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025