NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి 
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి 
    Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి

    Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2024
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

    ఉత్తర్‌ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రోహా జిల్లాకు చెందిన రహీజుద్దీన్‌ కుటుంబంలోని లోని ఏడుగురు సోమవారం రాత్రి పడుకునే ముందు బొగ్గుల కుంపటిని ఏర్పాటు చేసుకున్నారు.

    ఇంటి తలుపులు, కిటీకీలు మూసివేయడంతో కాసేపటికి కుంపటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.

    Details 

    భార్య, సోదరుడి పరిస్థితి విషమం

    మంగళవారం సాయంత్రం వరకు తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.

    తలుపులు పగులగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.

    ఈ ప్రమాదంలో రహీజుద్దీన్‌ ముగ్గురు పిల్లలు, అతని బంధువుల ఇద్దరు పిల్లలు మరణించారు.

    అతని భార్య, సోదరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    పోలీసు సూపరింటెండెంట్ కున్వర్ అనుపమ్ సింగ్‌తో సహా భారీ పోలీసు బలగాలు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు
    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: మధుర CMO క్యాంపస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకేజ్ భారతదేశం
    BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం భారతదేశం
    Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు  బస్సు ప్రమాదం
    UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025