UP: దుంగార్పూర్ కేసులో ఆజం ఖాన్కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు
దుంగార్పూర్ కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 427, 504, 506, 447, 120బీ కింద ఆజం ఖాన్ను దోషిగా కోర్టు ప్రకటించింది. ఆజం ఖాన్తో పాటు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అజరు అహ్మద్ ఖాన్, కాంట్రాక్టర్ బర్కత్ అలీ, రిటైర్డ్ సీఓ అలె హసన్లు కూడా దోషులుగా తేలింది. ఈరోజు కోర్టు వీరికి శిక్ష విధించింది. ఈ సందర్భంగా సీతాపూర్ జైలు నుంచి ఎస్పీ నేత ఆజంఖాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షమయ్యారు.