NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
    తదుపరి వార్తా కథనం
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
    టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2025
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు.

    కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

    ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటుగా అభివర్ణిస్తున్నారు.

    1994లో విశాఖపట్టణం- 2అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన పల్లా సింహాచలం, నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నేతగా గుర్తింపు పొందారు.

    Details

    సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

    స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడిన ఆయన సేవలు మరవలేనివని పలువురు నేతలు పేర్కొంటున్నారు.

    ఈ నేపథ్యంలో పల్లా సింహాచలం మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి, తన కుటుంబానికి చాలా కాలంగా విశ్వసనీయంగా సేవ చేసిన నేతగా ఆయనను కొనియాడారు.

    విశాఖపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

    ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించిన చంద్రబాబు, పల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్

    విశాఖపట్టణం

    PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్  భారతదేశం
    Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం భారతదేశం
    Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం
    Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025