NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు
    తదుపరి వార్తా కథనం
    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు
    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడు షారుఖ్ సైఫీ అరెస్టు

    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు

    వ్రాసిన వారు Stalin
    Apr 05, 2023
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

    మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్‌లో అతనిడి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని షారుఖ్ సైఫీగా గుర్తించారు.

    కేరళ కోజికోడ్‌లో అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో సహ ప్రయాణికుడికి నిప్పంటించిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. రత్నగిరిలో పోలీసులకు మంగళవారం అతడి ఆచూకీ లభించింది.

    అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్‌‌లో తోటి ప్రయాణికుడికి నిప్పంటించి కిందకు దూకడంతో షారుఖ్ సైఫీ తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతడు రత్నగిరి సివిల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.

    చికిత్స పూర్తికాకుండానే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు రత్నగిరి ప్రాంతంలో సోదాలు నిర్వహించి షారుఖ్ సైఫీని అదుపులోకి తీసుకున్నారు.

    కేరళ

    కేరళ రైలులో అగ్నిప్రమాదం పూర్వపరాలు ఇవీ

    ఏప్రిల్ 2(ఆదివారం)రాత్రి 9.45 గంటల ప్రాంతంలో అలపుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించాడు. ఫలితంగా కనీసం ఎనిమిది మందికి మంటలంటుకొని గాయాలపాలయ్యారు.

    ఈ ఘటన తర్వాత ఏడాది వయసున్న చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు రైలు నుంచి తప్పిపోయినట్లు తెలిసింది. అదేరోజు రాత్రి ఎలత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఆ ముగ్గురు శవమై కనిపించారు. మంటలు ఎగిసిపడటం చూసి వారు కిందకు దిగేందుకు ప్రయత్నించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

    కేరళను కుదిపేసిన ఈ ఘటనపై సిట్, ఎన్ఐఏ, ఆర్‌పీఎఫ్ సహా వివిధ దర్యాప్తు సంస్థల సీనియర్ అధికారులు విచారణ చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    తాజా వార్తలు

    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్ ముంబై
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు కోవిడ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ పంజాబ్
    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025