NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ
    తదుపరి వార్తా కథనం
    జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ
    జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ

    జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ

    వ్రాసిన వారు Stalin
    May 17, 2023
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.

    వాస్తవానికి దేశంలోని గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఇందులో జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం గమనార్హం.

    ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ, టీడీపీని ఈసీ గుర్తింపు పొందిన జాబితాలో చేర్చింది.

    ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, తెలంగాణలో వైసీపీని కూడా గుర్తింపు పొందిన జాబితాలో ఈసీ చేర్చింది.

    జనసేన

    ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే గుర్తును కోల్పోయిన జనసేన 

    అయితే జనసేన పార్టీ సింబల్‌ను కోల్పోవడానికి గల కారణాలను ఈసీ వెల్లడించింది. పలు ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం వల్లే గుర్తును కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

    ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే, కచ్చితంగా ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పొందాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.

    అయితే గతేడాది జరిగిన బద్వేలు ఉప ఎన్నికల సమయంలోనే జనసేన గాజు గ్లాసును గుర్తును ఈసీ తొలగించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జనసేన
    ఆంధ్రప్రదేశ్
    ఎన్నికల సంఘం
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జనసేన

    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్

    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  కడప
    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు కర్ణాటక
     వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ  వైజాగ్
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత వైఎస్సార్ కడప

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ లోక్‌సభ
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్

    తాజా వార్తలు

    జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు  జమ్ముకశ్మీర్
    కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం కర్ణాటక
    ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు చంద్రుడు
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  సీబీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025