Tenali: తెనాలిలో షాకింగ్ ఘటన.. న్యూడ్ చాటింగ్పై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
తెనాలి కేంద్రంగా సాగిన ఆన్లైన్ అసభ్య చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. పట్టణంలోని పాండురంగపేటలో ఉన్న ఓ ఇల్లు కేంద్రంగా 44, 54 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా వ్యక్తులతో అనుచిత చాటింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో మహిళల్లో ఒకరి కుమారుడైన సాయి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అతడు ఈ కార్యకలాపాలకు సహకరిస్తున్నాడని అనుమానిస్తున్నారు.
వివరాలు
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
అందిన సమాచారం మేరకు పోలీసులు సుమోటోగా కేసు తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా పలువురిని విచారించి వివరాలు సేకరించారు. తదుపరి చర్యల కోసం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి అని పోలీసులు పేర్కొన్నారు. కేసులో ఉన్న ఇద్దరు మహిళలను బాధితులుగా పరిగణిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.