LOADING...
Bihar Anganwadi: 'మానవత్వం చచ్చిపోయింది'.. డ్రిప్‌తోనే పనికి హాజరైన అంగన్‌వాడీ వర్కర్.. బిహార్‌లో షాకింగ్ ఘటన
బిహార్‌లో షాకింగ్ ఘటన

Bihar Anganwadi: 'మానవత్వం చచ్చిపోయింది'.. డ్రిప్‌తోనే పనికి హాజరైన అంగన్‌వాడీ వర్కర్.. బిహార్‌లో షాకింగ్ ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని కటిహార్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అనారోగ్యంతో సెలవులో ఉన్న అంగన్‌వాడీ వర్కర్ ప్రేమలత హెంబ్రాన్ని, తన అనారోగ్యాన్ని నిరూపించాలంటూ అధికారి ఒత్తిడి చేయడంతో, చివరకు డ్రిప్ పెట్టుకుని సెంటర్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె డ్యూటీలో లేని సమయంలో సీడీపీవో సెంటర్‌కి వచ్చి పరిశీలించారు. ఇంట్లో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుందని చెప్పినా, నమ్మకపోయిన అధికారి స్వయంగా వచ్చి నిరూపించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఉద్యోగం లేదా జీతంపై చర్యలు ఉంటాయన్న భయంతో ప్రేమలత బలహీన స్థితిలోనే డ్రిప్ పెట్టుకుని సెంటర్‌కు చేరింది.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

వీడియోలో ఆమెను ఒక వ్యక్తి పట్టుకుని నిలబెట్టగా, మరోవైపు డ్రిప్ బాటిల్ పట్టుకుని కనిపించడంతో ఈ దృశ్యాలు అందరినీ కలచివేశాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో రణవిజయ్ సింగ్ షేర్ చేయగా, ఇది వేగంగా వైరల్ అయింది. అనారోగ్యాన్ని నిరూపించేందుకు ఇలా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ పేపర్లు పంపినా సరిపోదా అని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్లపై వ్యవస్థ ఇలాగే ఒత్తిడి తెస్తోందని, ఇది కట్టుబాటు కాదు భయం అని కామెంట్లు చేస్తున్నారు. కార్మిక చట్టాలు ఉన్నా అమలు ఎక్కడ ఉందని, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 'మానవత్వం చచ్చిపోయిందా?' అనే ప్రశ్నతో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెలైన్'తో అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకున్న కార్యకర్త (వీడియో)

Advertisement