
Army Vehicle Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..
ఈ వార్తాకథనం ఏంటి
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుండి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాకు వెళ్లే మార్గంలో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెనోక్ రోంగ్లీ రాష్ట్ర రహదారిపై దలోప్చంద్ దారా సమీపంలో ఆర్మీ వాహనం 300 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది.
సమాచారం అందగానే ఆర్మీ,పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
ప్రమాదానికి గల కారణాల గురించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.
వివరాలు
లడఖ్లో ఇలాంటి ప్రమాదమే
ఈ సిబ్బంది పశ్చిమ బెంగాల్ బినాగురిలోని ఎన్రోట్ మిషన్ కమాండ్ విభాగానికి చెందినవారు.
గత ఏడాది కూడా లడఖ్లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఆగస్టులో, లేహ్ సమీపంలోని క్యారీ గ్రామంలో ఆర్మీ వాహనం కాలువలో పడిపోయింది.
ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు, అందులో జేసీఓ (జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) కూడా ఉన్నారు.