Page Loader
Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం 
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి యూనియన్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నత న్యాయస్థానం వీలు కల్పించింది. ఈ మేరకు సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్'ను కోర్టు కొట్టివేసింది. అంతకుముందు ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టు తలుపు తట్టింది. ఇవాళ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ల క్రితమే నిర్వహించాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి, ఎన్నికల నిర్వహణపై నాలుగేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు వేర్వేరు కారణాలతో ఎప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

DETAILS

ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించారు

ఏప్రిల్, మేలో జరగాల్సిన ఎన్నికలను కోర్టు జోక్యంతో అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమై సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగింది. నామినేషన్లు, ఉపసంహరణలు, మార్కుల కేటాయింపు తర్వాత కొన్ని కార్మిక సంఘాలు మళ్లీ సింగరేణి యాజమాన్యాన్ని, గత ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల నిర్వహణ కారణంగా, గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి సంస్థ కోర్టును అభ్యర్థించింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో తాజాగా ఆర్ఎల్సీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసన్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా