NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్‌ తయారీకి ముందడుగు!
    తదుపరి వార్తా కథనం
    Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్‌ తయారీకి ముందడుగు!
    సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్‌ తయారీకి ముందడుగు!

    Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్‌ తయారీకి ముందడుగు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగరేణి సంస్థ మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    దేశంలోనే తొలిసారి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పన్నమయ్యే కార్బన్ డయాక్సైడ్‌‌ను ఉపయోగించి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సింగరేణి యోచిస్తోంది.

    ఈ ప్లాంట్ రోజుకు 500 కేజీల కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి 180 కిలోల మిథనాల్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

    కోల్ ఇండియా, ప్రైవేట్ సంస్థలతో కలిసి నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైతే, పెద్ద స్థాయి మిథనాల్‌ ఉత్పత్తి యూనిట్‌‌ను స్థాపించే ప్రణాళికలు కూడా సిద్ధం ఉన్నాయి.

    మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది.

    Details

    హైడ్రోజన్ తో కలిపి మిథనాల్ తయారీ

    ఈ ప్లాంట్‌ ద్వారా బొగ్గు మండించిన తర్వాత ఉత్పన్నమయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌‌ను సేకరించి, హైడ్రోజన్‌తో కలిపి మిథనాల్‌ తయారు కానుంది.

    వాయువుల ఉద్గారాలను వాతావరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్ (ఎస్పీ) ను ఏర్పాటు చేసింది.

    ఈ ప్రాజెక్ట్‌ కోసం సింగరేణి, కోల్ ఇండియా, సీఎం పీడీఐఎల్‌ (కోల్ ఇండియా రీసెర్చ్ యూనిట్‌) వంటి సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

    ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్, బ్రీత్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది.

    నిర్మాణం వచ్చే నెల 31 నాటికి పూర్తవుతుందని, త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

    Details

    ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు

    మిథనాల్‌ను విస్తృతంగా ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్ల తయారీలో ఉపయోగిస్తారు.

    ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, మిథనాల్‌ను వివిధ పరిశ్రమలకు విక్రయించడం ద్వారా సంస్థకు, అలాగే దేశానికి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలున్నాయి.

    ప్రస్తుతం దేశంలో 120 మిలియన్‌ టన్నుల మిథనాల్‌ అవసరాలలో 80 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటున్నారు.

    ఈ ప్రాజెక్టు సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా, దేశీయ పరిశ్రమలకు కూడా చాలా లాభదాయకంగా మారే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

    SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు హైకోర్టు
    Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు తాజా వార్తలు
    Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం  భారతదేశం
    Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025