Loading...
Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. తాజాగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచిక 500 మార్క్‌ను చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 494గా నమోదైంది, ఇది ఈ సీజన్‌లో అత్యధికంగా ఉంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, గొంతు నొప్పి, దురద వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజధాని మొత్తం ప్రాంతంలో గాలి నాణ్యత పెరిగిన కాలుష్యంతో క్షీణించిపోయింది. నగరాన్ని కమ్మేసిన పొగమంచు వలన కాలుష్యం మరింత పెరిగింది. మంగళవారం ఉదయం కొన్ని ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో AQI స్థాయి 500 మార్క్‌ను తాకింది, ఇది సివియర్‌ ప్లస్‌ కేటగిరీకి చెందుతుంది.

వివరాలు 

పొగమంచు కారణంగా తగ్గిన దృశ్యమానత

ద్వారకలో అతి తక్కువ AQI 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో ఇదే స్థాయిలో కాలుష్యం ఉండగా, ఈ రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

పొగమంచు కారణంగా దృశ్యమానత చాలా తగ్గిపోయింది. వాహనాలు ముందుగా వెళ్ళడంలో కూడా కష్టం అవుతోంది.

ఇది విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని మార్గాలను మార్చారు. ఉదయం 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 9 రైళ్లు రద్దు అయ్యాయి.

వివరాలు 

పాఠశాలలు మూసివేత.. ఆన్‌లైన్‌ తరగతులు

కాలుష్యం నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఆర్‌ రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలుకు సంబంధించిన గంభీరమైన వ్యాఖ్యలు చేసింది.

కాలుష్య నియంత్రణ చర్యలను తక్షణమే అమలు చేయాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌కు సూచించిన సుప్రీంకోర్టు, నాల్గవ దశ ఆంక్షలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

దీనితో, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశం నిలిపివేయడం, పాఠశాలలు మూసివేయడం, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి.

ADVERTISEMENT