NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
    ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

    Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. తాజాగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచిక 500 మార్క్‌ను చేరింది.

    మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 494గా నమోదైంది, ఇది ఈ సీజన్‌లో అత్యధికంగా ఉంది.

    కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, గొంతు నొప్పి, దురద వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

    రాజధాని మొత్తం ప్రాంతంలో గాలి నాణ్యత పెరిగిన కాలుష్యంతో క్షీణించిపోయింది. నగరాన్ని కమ్మేసిన పొగమంచు వలన కాలుష్యం మరింత పెరిగింది.

    మంగళవారం ఉదయం కొన్ని ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో AQI స్థాయి 500 మార్క్‌ను తాకింది, ఇది సివియర్‌ ప్లస్‌ కేటగిరీకి చెందుతుంది.

    వివరాలు 

    పొగమంచు కారణంగా తగ్గిన దృశ్యమానత

    ద్వారకలో అతి తక్కువ AQI 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో ఇదే స్థాయిలో కాలుష్యం ఉండగా, ఈ రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

    పొగమంచు కారణంగా దృశ్యమానత చాలా తగ్గిపోయింది. వాహనాలు ముందుగా వెళ్ళడంలో కూడా కష్టం అవుతోంది.

    ఇది విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని మార్గాలను మార్చారు. ఉదయం 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 9 రైళ్లు రద్దు అయ్యాయి.

    వివరాలు 

    పాఠశాలలు మూసివేత.. ఆన్‌లైన్‌ తరగతులు

    కాలుష్యం నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఆర్‌ రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలుకు సంబంధించిన గంభీరమైన వ్యాఖ్యలు చేసింది.

    కాలుష్య నియంత్రణ చర్యలను తక్షణమే అమలు చేయాలని ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌కు సూచించిన సుప్రీంకోర్టు, నాల్గవ దశ ఆంక్షలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

    దీనితో, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశం నిలిపివేయడం, పాఠశాలలు మూసివేయడం, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇండియా
    Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్ ఇండియా
    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  అమిత్ షా
    Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025