NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
    భారతదేశం

    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

    వ్రాసిన వారు Naveen Stalin
    February 20, 2023 | 01:14 pm 1 నిమి చదవండి
    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
    కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది. బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన కూలిపోవడానికంటే ముందే ఒక ప్రధాన తీగలోని సగం వైర్లు తుప్పు పట్టి, విరిగిపోయినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. సివిక్ బాడీ జనరల్ బోర్డు ఆమోదం లేకుండా ఒరెవా గ్రూప్‌తో మెయింటెనెన్స్ ఒప్పందంపై సంతకం చేసినందుకు మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జాలా పేరును నివేదికలో చేర్చింది. ప్రజలు వంతెనను పాడుచేయకుండా నిరోధించడానికి తగినంత భద్రత లేదని సిట్ పేర్కొంది.

    వంతెన పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేదు: సిట్

    కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300మంది వ్యక్తులు ఉన్నారని, ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువని సిట్ అధికారులు చెప్పారు. విక్రయించిన టిక్కెట్‌ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేనందున ఒకేసారి అంతమంది వంతెనపైకి వచ్చినట్లు పేర్కొన్నారు. వంతెన ప్లాట్ ఫార్‌మ్ ఉన్న చెక్కలను తొలగించి, అల్యూమినియం ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల వంతెన బరువు పెరిగి, అది కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా సిట్ పేర్కొంది. వంతెనకు పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేని వివరించింది. నిర్మాణ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని అజంతా గోడ గడియారాలు, ఈ-బైక్‌ల తయారీదారు ఒరేవా గ్రూప్‌కు గత ఏడాది మార్చిలో 15 సంవత్సరాల కాలానికి మోర్బీ వంతెన మరమ్మతుల పనులను మున్సిపాలిటీ అప్పగించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    గుజరాత్
    నరేంద్ర మోదీ

    గుజరాత్

    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు బీబీసీ
    తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై
    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    నరేంద్ర మోదీ

    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ బెంగళూరు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023