NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ
    తదుపరి వార్తా కథనం
    SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ
    నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ

    SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్‌ వేగవంతం చేసింది.

    ఆదివారం సిట్‌ సభ్యులు సమావేశమై, ఎవరు ఏ అంశాలు విచారించాలన్న బాధ్యతలు పంచుకున్నారు.

    కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు.

    ఏఆర్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసి, దేవస్థానాన్ని మోసం చేసిందని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సిట్‌ దర్యాప్తు ప్రారంభించింది.

    వివరాలు 

    టెండర్‌ వివరాలు 

    ఫిర్యాదులో ఏఆర్‌ డెయిరీ సంస్థ తక్కువ ధరకు నెయ్యి అందించేందుకు ముందుకు వచ్చి, టీటీడిను టెండర్‌ మంజూరు చేసేలా ప్రేరేపించినట్లు పేర్కొన్నారు.

    వారు కల్తీ నెయ్యి సరఫరా చేసి, టీటీడీను, భక్తులను మోసగించారని, ఈ వ్యవహారాన్ని నేరపూరిత కుట్రగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

    సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేశారు.

    సిట్‌ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదివారం టీటీడీ ఈవో శ్యామలరావును కలసి, ఏఆర్‌ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన అంశంపై వివరణ కోరారు.

    టెండర్లలో ఏ సంస్థలు పాల్గొన్నాయి, గరిష్ఠ, కనిష్ఠ ధరలపై ఎవరు టెండర్‌ వేశారు, సరఫరా తీరు ఎలా ఉన్నది వంటి వివరాలు సేకరించారు.

    వివరాలు 

    సిట్‌ దర్యాప్తులో వేగం

    అనంతరం ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణను వివరాలు అడిగి, టెండర్‌ ప్రక్రియలో ఏ సంస్థలను పరిశీలించారో తెలుసుకున్నారు.

    ఎల్‌-1గా వచ్చిన ఏఆర్‌ డెయిరీకి టెండర్‌ కట్టబెట్టిన ముందు ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చారా, టెండర్‌ ధరను మార్కెట్‌ ధరతో పోల్చారో వంటి ప్రశ్నలు అడిగారు.

    సిట్‌ దర్యాప్తులో వేగం పెంచుతూ, సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపనుంది.

    వివరాలు 

    దర్యాప్తు బృందాలు ఏర్పాటు 

    తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో నమోదు అయిన 470/24 కేసుపై సిట్‌ బృందం దర్యాప్తు మొదలు పెట్టింది. కేసు డైరీని పరిశీలించి,విచారణకు ఓ అధికారి నియమించారు.

    దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి పంపించనున్నారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

    ఏఆర్‌ డెయిరీకి టెండర్ల కేటాయింపు సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.

    డెయిరీతో పాటు టీటీడీ అధికారులకు నోటీసులు ఇవ్వడమన్నది ప్రాథమిక దశలో ఉంది. అవసరమైతే అదనపు సమాచారం అందజేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025