English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 
    తదుపరి వార్తా కథనం
    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 
    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్

    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 

    వ్రాసిన వారు Stalin
    Aug 02, 2023
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలో మత హింస కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు.

    ఘర్షణల్లో బజరంగ్‌దళ్ సభ్యుడు మోను మనేసర్ పాత్రపై విచారణ జరుగుతోందని అగర్వాల్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.

    రాష్ట్రంలో నుహ్ హింసాకాండ తర్వాత కనీసం 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని డీజీపీ చెప్పారు.

    విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో హింస చెలరేగింది. ఆ తర్వాత ఆ అల్లర్లు గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి సహా ఆరుగురు మరణించారు.

    ముస్లింలు అధికంగా ఉండే నూహ్‌లో హింసకు సంబంధించిన వార్తలు వ్యాపించడంతో, సోహ్నాలోని ఓ వర్గానికి చెందిన వారు నాలుగు వాహనాలు, దుకాణాన్ని తగులబెట్టారు.

    హర్యానా

    ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ

    రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, నుహ్‌లో కొద్దిసేపు కర్ఫ్యూను సడలించినట్లు డీజీపీ పీకే అగర్వాల్ డీజీపీ చెప్పారు.

    గురుగ్రామ్ పూర్తిగా సురక్షితంంగా ఉందని, తాజాగా ఎటువంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదన్నారు.

    సీనియర్ అధికారులను నుహ్‌లో మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని పోలీసు బలగాలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

    హింసాత్మక కేసులన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. గురుగ్రామ్‌లోని మసీదు మతాధికారిని హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.

    నుహ్‌లో మొత్తం 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, 116 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 100 మందికి పైగా అనుమానితులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    తాజా వార్తలు

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    తాజా వార్తలు

    Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు ప్రతిపక్షాలు
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం తెలంగాణ
    American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025