NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sikkim Landslides: సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి.. చిక్కుకుపోయిన 1500 మంది పర్యాటకులు
    తదుపరి వార్తా కథనం
    Sikkim Landslides: సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి.. చిక్కుకుపోయిన 1500 మంది పర్యాటకులు
    సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి

    Sikkim Landslides: సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి.. చిక్కుకుపోయిన 1500 మంది పర్యాటకులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 14, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో కనీసం 6 మంది మరణించగా.. 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.

    ఈ మేరకు అధికారులు గురువారం సమాచారం అందించారు. సంగ్‌కలాంగ్‌లో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందని, దీని కారణంగా మంగన్‌కు ద్జోంగ్, చుంగ్‌తాంగ్‌లతో సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు.

    కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయని, అనేక ఇళ్లు నీటమునిగి దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    చాలా పట్టణాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయాయి 

    గురుడోంగ్‌మార్ సరస్సు, యుంథాంగ్ వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మంగన్ జిల్లాలోని జోంగు, చుంగ్‌తాంగ్, లాచెన్, లాచుంగ్ వంటి పట్టణాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

    మంగన్ జిల్లా మేజిస్ట్రేట్ హేమ్ కుమార్ ఛెత్రీ మాట్లాడుతూ, "గీతాంగ్,నాంపతంగ్‌లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి." నిర్వాసితుల కోసం సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఛెత్రి తెలిపారు.

    కొండచరియలు విరిగిపడటంతో బ్రింగ్‌బాంగ్ పోలీసు పోస్ట్‌ను సమీపంలోని ప్రదేశానికి మార్చారు, సంకలన్ వద్ద వంతెన పునాది దెబ్బతింది.

    నిరంతర వర్షాలు,కొండచరియలు విరిగిపడుతుండటంతో ఉత్తర సిక్కింలో మొబైల్ నెట్‌వర్క్ ప్రభావితమైందని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    సిక్కిం ముఖ్యమంత్రి ప్రకటన 

    అదే సమయంలో, మంగన్‌కు రేషన్‌తో కూడిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాన్ని పంపాలని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది.

    మంగ్‌శిలా డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

    బీజేపీ నాయకుడు పెమా ఖండూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అరుణాచల్ ప్రదేశ్‌కు వచ్చిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉత్తర జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సంభాషించారు.

    బాధితులు, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తమాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

    పునరావాస సహాయం, తాత్కాలిక నివాసాల ఏర్పాటు, ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025