
Road Accident: సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గురువారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు.
సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా 10 మందితో వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
అయితే వాహనం కోదాడ పట్టణానికి చేరుకోగానే బ్రేక్డౌన్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా,ఇద్దరు గాయపడ్డారు.
Details
మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
ముగ్గురు చిన్నారులు క్షేమంగా ఉండగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
లారీని కారు డ్రైవర్ గమనించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం తెల్లవారుజామున లారీ ఢీకొని యువ జంట మృతి చెందిన విషయం తెలిసిందే.