NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!
    ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

    SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.

    శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

    అయితే చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.

    ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు, బురదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సహాయక చర్యల్లో వేగం పెంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రంగంలోకి దించుతున్నట్లు మంత్రులు ఉత్తమ్, జూపల్లి తెలిపారు.

    Details

    ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం

    అదనంగా భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయాన్ని కూడా కోరినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా రక్షణ చర్యలు ప్రారంభించగా, లోపలికి మట్టి, నీరు చేరి 8 మీటర్ల మేర మార్గాన్ని మూసివేసినట్లు తెలిపారు.

    ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం.

    అలాగే ఆరుగురు జయప్రకాష్ అసోషియేట్స్ ఉద్యోగులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది.

    అయితే, గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యోగులు అమెరికన్లా, ఇండియన్లా? అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

    Details

    ప్రమాదం ఎలా జరిగింది? 

    నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

    టన్నెల్ పైకప్పు మూడుమీటర్ల మేర కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

    ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ ప్రాంతంలో ఎడమ వైపు టన్నెల్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    Telangana: పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం సుప్రీంకోర్టు
    Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక ప్రభుత్వం
    Ration Card: రేషన్ కార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ ప్రూఫ్స్‌తో మీసేవలో అప్లై చేయండి హైదరాబాద్
    LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025