NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ 
    టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ

    SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

    లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నేవీ బృందం "ఆక్వా ఐ" పరికరాన్ని టన్నెల్‌లో ప్రవేశపెట్టింది.

    గత మూడు రోజులుగా సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

    అయితే, టన్నెల్ లోపల నాలుగైదు అడుగుల మేర బురద, నీరు ఉన్న కారణంగా , బాధితుల వద్దకు చేరుకోవడం కష్టంగా మారింది.

    నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లోపల, 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషిన్ తో పనులు కొనసాగుతుండగా, అకస్మాత్తుగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది.

    వివరాలు 

     సొరంగంలో చిక్కుపోయిన  8 మంది ఇంజినీర్లు, కార్మికులు 

    ఆ సమయంలో సుమారు 50 మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా, బోరింగ్ మెషీన్ అవతల ఉన్న 42 మంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తి,ఆపై లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ ప్రవేశ ద్వారం చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నారు.

    అయితే, టన్నెల్ బోరింగ్ మెషిన్ లోపలి వైపున ఉన్న మొత్తం 8 మంది ఇంజినీర్లు, కార్మికులు మాత్రం సొరంగంలో చిక్కుకుపోయారు.

    వారిని రక్షించేందుకు మొత్తం 9 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు నేవీ, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

    వివరాలు 

    తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం 

    టన్నెల్ లోపల నీరు, బురద పేరుకుపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ప్రమాదకరమైన విధానంగా భావించబడే "ర్యాట్ హోల్ మైనింగ్" విధానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.

    సాధారణంగా బొగ్గు గనుల్లో ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇందులో సన్నని, సమాంతర మార్గాలను ఏర్పాటు చేసి, గనులలో లోతుగా ప్రవేశించి బొగ్గును వెలికి తీయడం జరుగుతుంది.

    ఈ పద్ధతిలో ప్రధాన సవాలు ఏమిటంటే, తవ్విన మార్గాలు కేవలం నాలుగు అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో, ఒకేసారి ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్లగలుగుతాడు.

    కార్మికులు ప్రత్యేక సాధనాలతో, నిచ్చెనల సాయంతో లోపల ప్రవేశించి అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    Dharani Portal: ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. పరిగణనలోకి రెండు సంస్థలు.. త్వరలో ఉత్తర్వులు? భారతదేశం
    ORR: ఓఆర్‌ఆర్‌ వరకు నగర విస్తరణలో కీలక అడుగు.. భారీ సర్వేకు నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ భారతదేశం
    Telangana: 'పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన భారతదేశం
    Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ వాతావరణ మార్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025