NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ
    తదుపరి వార్తా కథనం
    SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ
    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

    SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 72 గంటలు (మూడు రోజులు) పూర్తయినప్పటికీ, సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు.

    టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ గురించి ఇప్పటికీ స్పష్టత రాలేదు.

    రక్షణ బృందాలు అనేకసార్లు టన్నెల్‌లోకి ప్రవేశించినా, ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వెనుదిరిగాయి.

    ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎల్ అండ్‌టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, భూగర్భశాస్త్ర నిపుణులు సహాయ చర్యల్లో నిమగ్నమైనా, ఎలాంటి పురోగతి కనిపించలేదు.

    టన్నెల్‌లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే నెలకొన్నాయని రక్షణ బృందాలు ఉన్నతాధికారులకు వివరించాయి.

    వివరాలు 

    టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్

    టీబీఎం యంత్రం సహాయ చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. యంత్రం వెనుక భాగంలో భారీగా మట్టి, బురద ఉండటంతో రక్షణ బృందాలు ముందుకు సాగలేకపోతున్నాయి.

    టీబీఎం యంత్రాన్ని కదిలించినట్లయితే పైకప్పు మరొకసారి కూలిపోవచ్చని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.

    టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో రక్షణ బృందాలు టీబీఎం యంత్రాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నాయి.

    ఇక టన్నెల్ వద్దకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు చేరుకొని, తమ వారిని రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

    వివరాలు 

    రక్షణ చర్యలు మరింత ప్రమాదకరం 

    త్వరలోనే రక్షణ బృందాలు, ఇంజనీర్లు, నిపుణులతో కలెక్టర్, ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

    నీటిని తొలగించేందుకు మేఘా కంపెనీ నుండి భారీ మోటార్లు తెప్పించే యోచనలో అధికారులు ఉన్నారు.

    బురదను బయటకు తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు.

    ఎల్ అండ్‌టీ, మేఘా ఇంజనీర్లు, నిపుణుల సహాయాన్ని కోరారు. అయితే, ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు మరింత ప్రమాదకరమని రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలంగాణ

    Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ వాతావరణ మార్పులు
    Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ! భారతదేశం
    Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి భారతదేశం
     TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025