Loading...
Sonia Gandhi: బొగ్గు కేసులో మన్మోహన్‌కు క్లీన్‌చిట్.. చరిత్ర మన్మోహన్ సింగ్‌ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది: సోనియా గాంధీ
బొగ్గు కుంభకోణం కేసు క్లీన్ చిట్‌పై సోనియా గాంధీ

Sonia Gandhi: బొగ్గు కేసులో మన్మోహన్‌కు క్లీన్‌చిట్.. చరిత్ర మన్మోహన్ సింగ్‌ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది: సోనియా గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడం చరిత్రాత్మక పరిణామమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ తీర్పుతో మన్మోహన్ సింగ్‌పై ఏళ్లుగా కొనసాగిన రాజకీయ ఆరోపణలు,కక్షసాధింపు, దుష్ప్రచారాలకు ముగింపు పలికినట్లయిందని పేర్కొన్నారు. ఈ మేరకు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. 2014 జనవరిలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ చరిత్రను నమ్ముతున్నానని,భవిష్యత్తులో చరిత్ర తన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని అప్పట్లో మన్మోహన్ చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆ మాటలను మరోసారి గుర్తు చేసిందని తెలిపారు.

వివరాలు 

విచారణ కోర్టు తీరుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన సోనియా

''మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎంతో దయతో, గౌరవంతో గుర్తుంచుకుంటుంది'' అని ఆమె అన్నారు.

బొగ్గు కేటాయింపుల కేసులో సీబీఐ సమర్పించిన క్లోజర్ నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించడాన్ని సోనియా గాంధీ స్వాగతించారు.

అదే సమయంలో విచారణ పరిధిని దాటి కొన్ని వ్యాఖ్యలు చేసిన ట్రయల్ కోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

ఈ పరిణామం మన్మోహన్ సింగ్‌పై గతంలో చేసిన ఆరోపణలపై కీలక స్పష్టత ఇచ్చిందని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం, నిజాయతీ, రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అప్పట్లో ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు జరిగాయని సోనియా ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థులతో పాటు కొందరు అధికారులు, మీడియా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యాయని ఆమె విమర్శించారు.

వివరాలు 

దర్యాప్తు సంస్థల వినియోగంపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు

మన్మోహన్ సింగ్ మచ్చలేని రాజకీయ జీవితంపై అనుమానాలు కలిగించేలా ఒక వ్యవస్థీకృత ప్రచారం సాగిందని పేర్కొన్నారు.

ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వంపైనా సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి అనుకూలంగా లేని రాజకీయ ప్రత్యర్థులపై ఈ సంస్థలను ఉపయోగిస్తున్నారన్న విమర్శలను ఆమె తన వ్యాసంలో ప్రస్తావించారు.

యూపీఏ పాలనలో సాధించిన ప్రగతిని కూడా సోనియా గాంధీ వివరించారు.

ఆర్థిక రంగంలో నమోదైన పురోగతితో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం వంటి కీలక కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తుచేశారు.

ADVERTISEMENT

వివరాలు 

దర్యాప్తు సంస్థల వినియోగంపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు

ఈ చర్యలు దేశంలోని సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ పదవిలో ఉన్న సమయంలో పెద్దగా ప్రచారం కోరుకోకుండా, ప్రశాంతంగా తన విధులు నిర్వర్తించారని సోనియా అన్నారు.

అయినప్పటికీ దేశానికి అత్యంత కీలకమైన సేవలు అందించిన ప్రధానమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.

ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన ఆరోపణలకు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టతనిచ్చిందని, భవిష్యత్‌లో మన్మోహన్ సింగ్ సేవలను దేశం గౌరవంగా గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT