Page Loader
Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం 
Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం

Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారని ఓపోలీసు అధికారి తెలిపారు.దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మహత్ ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తన భర్తతో కలిసి భారత్‌ పర్యటనకు వచ్చింది.అరడజను మందికి పైగా నిందితులు విదేశీ మహిళపై క్రూరంగా ప్రవర్తించారు. శుక్రవారం అర్థరాత్రి స్పానిష్ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ ఆదేశాల మేరకు పోలీసు బృందం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది.

Details 

భర్తతో కలిసి బైక్ రైడ్ కి వెళ్లిన స్పానిష్ మహిళ

హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం, స్పానిష్ మహిళ తన భర్తతో కలిసి బైక్ రైడ్ కోసం బయటకు వెళ్లింది. ఆమె దుమ్కా మీదుగా భాగల్పూర్ వైపు వెళుతోంది. అర్థరాత్రి, వారు హన్స్‌దిహా మార్కెట్‌కు ముందు ఒక ప్రదేశంలో ఒక టెంట్‌లో నిద్రిస్తున్నారు. ఇంతలో సమీపంలోని కొందరు యువకులు అక్కడికి చేరుకుని స్పెయిన్ మహిళపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త నిరసన వ్యక్తం చేయడంతో, నిందితులు అతనిని కొట్టారు.

Details 

విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం

ప్రస్తుతం బాధితురాలు దుమ్కా జిల్లాలోని సరయ్యహత్ సీహెచ్‌సీలో చేరింది. హన్స్‌దిహా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ప్రమేయమున్న నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్‌తో పాటు ఇతర బృందాల సహాయం తీసుకుంటున్నారు. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది.