J&K: జమ్ముకశ్మీర్ ఫ్రూట్ మండిలో పేలిన స్టీమర్.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్రూట్ మండిలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో స్టీమర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం జుమ్ జుమ్ కోల్డ్ స్టోర్లో స్టీమర్ను అమర్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రంగా ఉండటంతో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సరోప్ సింఘాల్, దిలీప్ కుమార్లుగా గుర్తించారు. గాయపడిన రామ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేలుడు శబ్దం దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన వెంటనే అగ్ని ప్రమాదం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ముకశ్మీర్లో విషాదం
#WATCH | Shopian, Jammu and Kashmir: Two people were killed, and one was injured after a steamer blast at a cold storage facility in the Fruit Mandi area of Shopian. Jammu and Kashmir Police reached the spot and have started an investigation.
— ANI (@ANI) April 30, 2026
(Visuals from the spot) pic.twitter.com/40C9FhrB13