NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు
    జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు

    Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2025
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    ఈ బృందం ప్రభావిత గ్రామాన్ని సందర్శించి, మరణాలకు గల కారణాలను తెలియజేయనుంది. ఈ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి నేతృత్వం వహించనున్నారు.

    ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వ్యవసాయ, రసాయనాలు, ఎరువులు, జలవనరుల మంత్రిత్వ శాఖల నిపుణులు ఉంటారు.

    ఈ దర్యాప్తు బృందానికి పశుసంవర్ధక, ఆహార భద్రత, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిపుణులు కూడా సహకరించనున్నారు.

    Details

    ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మృతి

    జనవరి 19న ఈ బృందం తన పర్యటనను ప్రారంభించి, గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తుంది.

    భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టడానికి స్థానిక పరిపాలనతో కలిసి పని చేయనుంది.

    గత 45 రోజుల్లో, రాజౌరి జిల్లాలోని బుధల్ గ్రామంలో 16 మంది మర్మమైన వ్యాధి కారణంగా మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉండడం గమనార్హం.

    బాధితుల్లో జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించగా, కొందరు ఆసుపత్రిలో చేరి కొద్దిరోజుల్లో మరణించారు.

    Details

    పిల్లలపై ఎక్కువ ప్రభావం

    ముఖ్యంగా పిల్లలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపగా, 80 ఏళ్ల వృద్ధురాలు కూడా ఈ వ్యాధి కారణంగా మరణించింది. ప్రస్తుతం, ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

    గత నెలలో వ్యాధి తొలుత గుర్తించినప్పుడు వందలాది నమూనాలను ఆరోగ్య శాఖ ప్రయోగశాలకు పంపించారు.

    కానీ ఇప్పటివరకు ఎటువంటి వైరస్ లేదా వ్యాధిని గుర్తించలేకపోయారు.

    ఈ ఘటనపై దృష్టి సారించి, దేశంలోని ప్రముఖ సంస్థల నిపుణుల సాయంతో మరణాలకు గల అసలు కారణాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    అమిత్ షా

    Amitshah: ఎన్నికల తర్వాత యూసీసీ, ఒకే దేశం ఒకే ఎన్నికలు: అమిత్ షా  భారతదేశం
    Jammu and Kashmir: అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలపై హోం మంత్రి సమీక్ష  జమ్ముకశ్మీర్
    Amit Shah: అమిత్ షా అధ్యక్షతన మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం  మణిపూర్
    Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా కేరళ

    జమ్ముకశ్మీర్

    Iltija Mufti: జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి  భారతదేశం
    Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌ హర్యానా
    Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇండియా
    Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025