
Sunitha Kejriwal:'బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్.. వాట్సాప్ నంబర్ను విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈరోజు నుంచి కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నామని సునీతా కేజ్రీవాల్ తెలిపారు.
'బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్' ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని సునీతా కేజ్రీవాల్ తెలిపారు.
ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా వారికి తెలియజేయవచ్చు. ప్రచారం కోసం ఆమె 8297324624, 9700297002 అనే రెండు వాట్సాప్ నంబర్లను జారీ చేశారు.
ఈ వాట్సాప్ నంబర్లకు తప్పనిసరిగా మీ సందేశాన్ని పంపాలని ఆమె తెలిపారు.
మీరు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు,ప్రార్థనలతో ఏదైనా సందేశాన్ని పంపవచ్చు.
మీ ప్రతి సందేశాన్ని నేను అరవింద్ కేజ్రీవాల్కి అందజేస్తానని ఆమె అన్నారు. వారు మీ సందేశాన్ని చదివి చాలా సంతోషిస్తారన్నారు.
Details
కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు
ఈ పోరాటంలో మీ సోదరుడు, మీ కుమారుడు అరవింద్ కేజ్రీవాల్కు మీరు తప్పకుండా మద్దతు ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని సునీతా కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని సునీతా కేజ్రీవాల్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
సరిగ్గా అదే విధంగా, స్వాతంత్ర్య సమరయోధులు కూడా బ్రిటిష్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు.
నేడు అరవింద్ కూడా నియంతృత్వంపై పోరాడుతున్నారు. ఈ పోరాటంలో తమ సోదరుడు, తమ కుమారుడు అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ ప్రజలు, యావత్ దేశ ప్రజలు తప్పకుండా మద్దతు ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె అన్నారు.
Details
వాట్సాప్ నంబర్ను విస్తృతంగా ప్రచారం చేయండి: సునీతా కేజ్రీవాల్
సందేశం పంపడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వం అవసరం లేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు.
యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, ధనవంతులు, పేదలు అందరూ అరవింద్ను కొడుకుగా, అన్నగా భావించారని అన్నారు.
ఈ వాట్సాప్ నంబర్ను విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు, గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో మీడియాతో మాట్లాడిన సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ను చాలా వేధిస్తున్నారని అన్నారు.అయన ఆరోగ్యం బాగాలేదన్నారు.
గురువారం నాటి విచారణలో కోర్టు అరవింద్ కేజ్రీవాల్ను ఏప్రిల్ 1 వరకు ఈడీ రిమాండ్కు పంపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియో సందేశం ఇస్తున్న సునీతా కేజ్రీవాల్
VIDEO | Here's what Sunita Kejriwal, wife of Delhi CM Arvind Kejriwal said in a video message.
— Press Trust of India (@PTI_News) March 29, 2024
"We are starting a campaign from today - 'Kejriwal Ko Ashirwad'. You can send your blessings on the WhatsApp number I have shared with you."
(Full video available on PTI Videos -… pic.twitter.com/IVvxVYFkYt