NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన
    మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన

    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2025
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2025-26 వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు తెలంగాణ రైతులకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది.

    పెరిగిన సాగు వ్యయానికి అనుగుణంగా పంటలకి సరైన మద్దతు ధరలు లభిస్తాయని రైతులు భావించినప్పటికీ, కేంద్రం ప్రకటించిన ధరలు వారి అంచనాలను తల్లకిందలు చేశాయి.

    రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను కూడ కేంద్రం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

    జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ)కి పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించలేదని అధికార వర్గాల ఆవేదన వ్యక్తమైంది.

    Details

    ఖర్చులు పెరిగినా మద్దతు ధరలు తగిన స్థాయిలో లేవు

    పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, పెసలు, మినుములు వంటి నూనె గింజలు, పప్పుదాణ్యాలకు రాష్ట్రం సిఫార్సు చేసిన మేరకు ధరలు పెరగలేదు.

    తాము పెట్టే ఖర్చుల కంటే మద్దతు ధరలు తక్కువగానే ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు పంటల సాగు వ్యయం సంవత్సరానికి 10 శాతానికి పైగా పెరుగుతున్నదని చెబుతున్నారు.

    కూలీలు, యంత్రాల అద్దె, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రవాణా ఖర్చుల వల్ల సాగు వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, మద్దతు ధరలు ఆ స్థాయిలో పెరగకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.

    నల్గొండ జిల్లా రైతు సైదులు మాట్లాడుతూ, ''కేంద్రం ప్రకటించిన ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగినా మద్దతు ధరలు తగిన స్థాయిలో లేవు.

    Details

    రైతులకు తీవ్ర నష్టం

    ఇది రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుంది'' అని వాపోయారు.

    మరోవైపు, మార్కెట్‌ ధరలతో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు తక్కువగా ఉన్నాయని కూడా రైతులు పేర్కొంటున్నారు.

    ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌ యార్డుల్లో వరి (సాధారణ)కు క్వింటాకు రూ.2,500, ఏ-గ్రేడ్‌ రకం వరికి రూ.2,680, పత్తికి రూ.8,000, మొక్కజొన్నకు రూ.3,000, కందికి రూ.9,800-10,000, మినుములకు రూ.7,090-7,580, వేరుసెనగకు రూ.8,500 వరకు ధరలు లభిస్తున్నాయి.

    ఈ ధరలన్నీ మద్దతు ధరలకంటే ఎక్కువగానే ఉండటంతో రైతుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా అసంతృప్తి వెల్లివిరుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన తెలంగాణ
    IPL 2025: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత! ఐపీఎల్
    Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్ హైదరాబాద్
    Israel: శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌..  ఇజ్రాయెల్

    తెలంగాణ

    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు భారతదేశం
    Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం రేవంత్ రెడ్డి
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ ఆంధ్రప్రదేశ్
    Telangana: ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025