LOADING...
Puja Khedkar: దిల్లీ పోలీసుల ముందు హాజరవ్వాలని పూజా ఖేడ్కర్‌'ను ఆదేశించిన సుప్రీంకోర్టు 
దిల్లీ పోలీసుల ముందు హాజరవ్వాలని పూజా ఖేడ్కర్‌'ను ఆదేశించిన సుప్రీంకోర్టు

Puja Khedkar: దిల్లీ పోలీసుల ముందు హాజరవ్వాలని పూజా ఖేడ్కర్‌'ను ఆదేశించిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేద్కర్‌ (Puja Khedkar),యూపీఎస్సీ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పేరు ఇటీవలా మీడియాలో వినిపించింది. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదైంది.ఈ మేరకు,అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టి, మే 2న ఢిల్లీ పోలీసుల ముందు పూజా ఖేడ్కర్‌ను హాజరయ్యేలా ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను సోమవారం జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయితే, విచారణ జరిగినంతవరకు ఖేడ్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో కచ్చితమైన విచారణ జరగలేదని తెలిపిన న్యాయస్థానం,విచారణను త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది.

వివరాలు 

దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ

పోలీసుల తరఫున న్యాయవాది వాదిస్తూ, ఖేడ్కర్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలియజేసారు. అయినప్పటికీ, కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణను అందించింది. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించడంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ, ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీలో తిరిగి వెళ్లాలని ఆదేశించింది. యూపీఎస్సీ తప్పుడు పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసిందని గుర్తించడంతో, వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

వివరాలు 

పూజకు మధ్యంతర రక్షణ ఇచ్చిన కోర్టు 

ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్నిరద్దు చేయడంతో పూజా ఖేడ్కర్ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీ తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని కోర్టుకు వాదించినా, ఆమెకు నిరాశే ఎదురైంది. గత ఏడాది ఆగస్టులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణను అందించింది. కోర్టు ఈ మధ్యంతర రక్షణను ప్రతి సమయంలో పొడిగిస్తూ వచ్చింది.