NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం
    తదుపరి వార్తా కథనం
    Supreme Court : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం
    Supreme Court : జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు..రఘురామ పిటిషన్‌పై సుప్రీం

    Supreme Court : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 03, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

    ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆయా కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని కేంద్ర దర్యాప్తు బృందం నిలదీసింది.

    ఈ క్రమంలోనే రఘురామ కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాల్సిందిగా ఆదేశించింది.

    అక్రమాస్తుల కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

    గత పదేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు.

    details

    కోరుకున్న స్వేచ్ఛనిచ్చిన సీబీఐ : ఎంపీ రఘురామ

    మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్ధ (సీబీఐ) నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని ఎంపీ రాఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు.

    వీటిపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐ ఏజెన్సీలో కనిపించట్లేదన్నారు.

    ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నా, ఇష్టానుసారంగా వాయిదాలు కోరుకునే స్వేచ్ఛ ఇచ్చారని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.

    ఫలితంగా ఈ కేసులకు సంబంధించిన విచారణ చాలా ఆలస్యమైపోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే, కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదన్నారు.

    ఈ కారణంగానే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని, వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    సుప్రీంకోర్టు

    దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా  మనీష్ సిసోడియా
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్
    శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం  శివసేన

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025