NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం
    తదుపరి వార్తా కథనం
    మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం
    పిటిషనర్ పై ప్రశ్నలవర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

    మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో మోసపూరిత మతమతమార్పిడిలపై సుప్రీంకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.

    ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలోనే పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.

    మత మార్పిడిలను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణకు ధర్మాసం తిరస్కరించింది. ఈ అంశంలో న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లను నిలదీసింది.

    ఇలాంటి విషయాల్లో తాము ప్రభుత్వాలకు, మాండమస్‌ రిట్‌లను ఎలా జారీ చేయొచ్చో వెల్లడించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం అర్జీదారులకు చురకలు అంటించింది.

    DETAILS

    పిల్ అంటే ఆటవస్తువులా మారింది

    కర్ణాటక న్యాయవాది జిరోమ్‌ అన్టో హిందువులు, మైనర్లను మోసపూరిత మతమార్పిడిలు చేయిస్తున్నారని పిల్ దాఖలు చేశారు.

    దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం, పిల్‌ అంటే ఓ ఆటవస్తువులా తయారైందని మొట్టికాయలు వేసింది. ఇలాంటి వ్యాజ్యాలపై తాము సలహాలు ఇచ్చేవాళ్లం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

    కొత్తగా జారీ చేయాలి

    మరో కేసులో లద్దాఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎస్ఈసీ ఆగస్ట్ 5న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 7 రోజుల్లోగా కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉత్తర్వులు చేసింది.

    నేషనల్ కాన్ఫరెన్స్‌కు నాగలి గుర్తును కేటాయించడంపై అభ్యంతరం తెలుపుతూ లద్దాఖ్ పరిపాలనా శాఖ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేస్తూ లద్దాఖ్​ పరిపాలనా శాఖకు రూ.లక్ష ఫైన్ విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సుప్రీంకోర్టు

    Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే జ్ఞానవాపి మసీదు
    పీరియడ్స్ పరిశుభ్రత జాతీయ విధానంలో జాప్యంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక  తాజా వార్తలు
    ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025