NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ
    తదుపరి వార్తా కథనం
    జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ
    భద్రతా నీడలో జ్ఞానవాపిలో సర్వే ప్రారంభం.. బహిష్కరించిన మసీదు కమిటీ

    జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది.

    వారణాసిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను పటిష్ట భద్రతా నడుమ చేపట్టారు.

    ఉదయం 7 గంటలకే మసీదు ప్రాంగణానికి చేరుకున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  బృందం శాస్త్రీయ సర్వేని ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే కొనసాగనుంది.

    అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు వరకు రెండో దఫా సర్వే నిర్వహించనున్నారు. 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదును, హిందూ దేవాలయంపై పునః నిర్మించారా లేదా అనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు ఈ సర్వేని చేపట్టారు.

    DETAILS

    ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారంటున్న హిందూ సంఘాలు

    మరోవైపు సర్వేని వ్యతిరేకిస్తూ వస్తున్న అంజుమన్ ఇంతేజామియా (మసీదు కమిటీ), తాజాగా సర్వేను బహిష్కరించింది. సదరు మసీదు స్థానంలో ఒకప్పుడు హిందూ దేవాలయం(శివాలయం) ఉండేది.

    17వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని కూల్చి, దాని స్థానంలో మసీదును నిర్మించారని హిందూ సంఘాలు న్యాయపోరాటానికి దిగాయి.

    ఈ మేరకు మసీదులో సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని, దానిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు జూలై 21న ASIకి ఆదేశాలు జారీ చేసింది.

    దీన్ని సవాల్ చేస్తూ మసీద్‌ కమిటీ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లగా ఆగస్టు 3న సర్వేకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే సమయంలో నిర్మాణాలకు నష్టం జరగకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్ఞానవాపి మసీదు
    అలహాబాద్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జ్ఞానవాపి మసీదు

    జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్ భారతదేశం
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం  ఉత్తర్‌ప్రదేశ్
    Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే హైకోర్టు
    జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు  తాజా వార్తలు

    అలహాబాద్

    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత ఆదిపురుష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025