NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన! 
    స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన!

    Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 02, 2025
    01:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆధ్యాత్మికవేత్తగా పేరొందిన స్వామి నిత్యానంద గురించి తెలియని వారుండరు.

    అయితే, నిత్యానంద స్థాపించిన కైలస దేశం భౌగోళికంగా ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.

    తాజాగా నిత్యానంద మరణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నిత్యానంద మరణ వార్తలపై ఆయన మేనల్లుడి ప్రకటన స్వామి

    నిత్యానంద మరణించారని, ఆయన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేశారని నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సమాచారం పంపినట్లు కొన్ని వార్తలు వెల్లడించాయి.

    ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.

    Details

    నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారు 

    స్వామి నిత్యానంద మరణించారనే వార్తలపై కైలాస దేశం అధికారికంగా స్పందించింది.

    తమ గురువు నిత్యానంద పూర్తిగా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని, మరణ వార్తలన్నీ అసత్య ప్రచారమని వెల్లడించింది.

    కొంతమంది దురుద్దేశంతో ఈ రూమర్లను వ్యాపింపజేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని కైలాస వర్గాలు పేర్కొన్నాయి.

    నిత్యానంద మరణ వార్తలపై స్పష్టత

    మార్చి 30న జరిగిన ఉగాది ఉత్సవాల్లో నిత్యానంద స్వయంగా పాల్గొన్నారని కైలాస దేశం ప్రకటించింది. ఈ వాదనను మరింత బలపరిచేందుకు ఓ లైవ్ స్ట్రీమ్ లింకును కూడా పంచుకుంది.

    అయితే నిత్యానంద ప్రస్తుత నివాసం గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

    తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యానంద మరణ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టమవుతోంది.

    Details

    భారతదేశం విడిచిపోయిన నిత్యానంద 

    నిత్యానందపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. బలాత్కారం, అపహరణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన 2019లో దేశం విడిచిపెట్టి పరారయ్యారు.

    అనంతరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే స్వతంత్ర హిందూ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు.

    కైలాస దేశం వాస్తవమా? ఊహాజనితమా?

    కైలాస దేశం దక్షిణ అమెరికాలోని ఎక్వడార్ సమీపంలో ఉందని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటి వరకు అక్కడికి బాహ్య ప్రపంచం నుంచి ఎవరు వెళ్లిన రికార్డులు లేవు.

    నిత్యానంద స్థాపించిన ఈ దేశం ఎంతవరకు నిజమో ఇప్పటికీ సందేహమే. కానీ తాజా వార్తలతో నిత్యానంద మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    ఇండియా

    Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌ మధ్యప్రదేశ్
    TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!  తెలంగాణ
    Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం
    Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025