NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
    తదుపరి వార్తా కథనం
    Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
    స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం

    Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.

    స్వామి శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యోగా రంగానికి, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన అపూర్వ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

    ప్రతీ తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.

    ఆయన మృతి యోగా ప్రపంచానికి ఇది తీరని లోటని పేర్కొన్నాడు. శివానంద 1896, ఆగస్టు 8న అప్పటి అవిభాజ్య భారతదేశంలోని సిల్హెత్ జిల్లా (ఇప్పటి బంగ్లాదేశ్)లోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు.

    ఆయన ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు.

    Details

    గతంలో పద్మశ్రీ పురస్కారం అందజేత

    అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. అక్కడ గురువు ఓంకారానంద గోస్వామి శిష్యునిగా స్వీకరించి, శివానందకు యోగా, ఆధ్యాత్మికతపై బోధనలు ఇచ్చారు.

    అనంతరం ఆయన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా స్వామి శివానంద పూరీలో 400-600 కుష్టురోగులకు అంకితభావంతో సేవలు అందించారు.

    యోగా, ఆధ్యాత్మిక సేవల పరంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

    అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించినప్పుడు, ఆయన తెల్లటి ధోవతి, కుర్తా ధరించి, పాదరక్షలు లేకుండా, అతి సాదాసీదాగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    నరేంద్ర మోదీ

    Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..! భారతదేశం
    Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్ ఎం.కె. స్టాలిన్
    Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌ రేవంత్ రెడ్డి
    PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం

    ఉత్తర్‌ప్రదేశ్

    Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్‌లు రద్దు భారతదేశం
    Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు సుప్రీంకోర్టు
    Rakesh Rathore Arrested: సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..  భారతదేశం
    Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు భారతదేశం

    యోగి ఆదిత్యనాథ్

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025