LOADING...
American sweetcorn: ఎకరాకు లక్షకు పైగా ఆదాయం.. భావ్‌నగర్‌లో స్వీట్‌ కార్న్‌ సాగు జోరు
ఎకరాకు లక్షకు పైగా ఆదాయం.. భావ్‌నగర్‌లో స్వీట్‌ కార్న్‌ సాగు జోరు

American sweetcorn: ఎకరాకు లక్షకు పైగా ఆదాయం.. భావ్‌నగర్‌లో స్వీట్‌ కార్న్‌ సాగు జోరు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా అనగానే ఇప్పటివరకు పత్తి పొలాలు, వేరుశనగ సాగే గుర్తొచ్చేవి. అయితే తాజాగా అక్కడి రైతులు తమ సాగు పద్ధతిని మార్చుకుని కొత్త దారిలో ముందుకెళ్తున్నారు. సంప్రదాయ పంటల స్థానంలో ఇప్పుడు అమెరికన్‌ స్వీట్‌ కార్న్‌ (మొక్కజొన్న) సాగుపై దృష్టి పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గత ఐదేళ్లలో భావ్‌నగర్‌ జిల్లాలో ఈ రకమైన మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో సుమారు 898 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసి రైతులు రికార్డు స్థాయికి చేరుకున్నారు. మార్కెట్‌లో అమెరికన్‌ స్వీట్‌ కార్న్‌కు ఉన్న భారీ డిమాండ్‌ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.

వివరాలు 

అమెరికన్‌ మొక్కజొన్నకు 'ఫాల్‌ ఆర్మీవార్మ్‌' అనే పురుగు సమస్య

రెండు నుంచి మూడు ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నానని,ఒక్కో ఎకరాకు లక్ష రూపాయలకు పైగా నికర లాభం వస్తోందని కిశోర్‌భాయి అనే రైతు తెలిపారు. అయితే అమెరికన్‌ మొక్కజొన్నకు 'ఫాల్‌ ఆర్మీవార్మ్‌' అనే పురుగు సమస్య ఎక్కువగా ఉంటుందని భావ్‌నగర్‌ జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రిజ్వాన్‌ వివరించారు. ఈ తెగులు వచ్చేలోపే వేపనూనెతో పాటు అవసరమైన రసాయన ఎరువులు ఉపయోగించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించవచ్చని ఆయన సూచించారు. అకాల వర్షాలు, పురుగుల దాడులు, తీవ్రమైన మంచు ప్రభావం నుంచి పంటలను రక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం పర్యావరణ హితమైన నెట్‌హౌస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానాన్ని వినియోగించుకునే రైతులకు ప్రభుత్వం 65 శాతం వరకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

Advertisement