
#NewsBytesExplainer: ఎన్ఐఏ కస్టడీలో 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు
ఈ వార్తాకథనం ఏంటి
26/11 ముంబై ఉగ్రదాడులకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్నతహవూర్ హుసైన్ రాణాను గురువారం ప్రత్యేక విమానం ద్వారా అమెరికా నుంచి ఢిల్లీకి తరలించారు.
అక్కడికి రాగానే అతన్ని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను 18 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి అప్పగించింది.
శుక్రవారం నుండి ఏప్రిల్ 29 వరకు రాణాను విచారించనున్న అధికారులు, దాడుల వెనక ఉన్న కుట్రలు, దానిలో అతని పాత్ర, డేవిడ్ కోలెమాన్ హెడ్లీతో ఉన్న సంబంధాలపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
ముంబై ఉగ్రదాడుల్లో తహవూర్ రాణా కీలక పాత్ర
విచారణలో ప్రాధాన్యత ఇవ్వబోతున్న అంశాలు 26/11 ఉగ్రదాడి కుట్ర, లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో అతని సంబంధాలు, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో ఉన్న అనుబంధం గురించి రాణాను ప్రశ్నించనున్నారు.
ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. సీసీ కెమెరాల ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో తహవూర్ రాణా కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఆ తర్వాత అతను అమెరికాలో అరెస్టయి అక్కడి జైల్లో అనేక సంవత్సరాలు గడిపాడు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో, రాణాను భారత్కు అప్పగించాలంటూ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభ్యర్థించారు.
ట్రంప్ ఆ అభ్యర్థనకు అంగీకరించారు.
వివరాలు
రాణా విచారణలో NIA అధికారులు అడగబోయే ముఖ్యమైన ప్రశ్నలు:
26/11 సహ కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అతనికి 231 సార్లు ఎందుకు కాల్ చేశాడు?
2008 నవంబర్ 26 రాత్రి రాణా ఎక్కడ ఉన్నాడు?
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISIతో అతని సంబంధం ఏమిటి?
రాణా ప్రస్తుతం ఢిల్లీలోని CGO కాంప్లెక్స్లో ఉన్న NIA ప్రధాన కార్యాలయంలో 14x14 అడుగుల సెల్లో ఉన్నాడు.
ఈ సెల్లో సీసీటీవీ కెమెరాలు,బహుళ భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. రాణాను కలవడానికి 'స్పెషల్ 12' బృందానికి మాత్రమే అనుమతి ఉంది.. ఇతరులు ముందస్తు అనుమతి తీసుకోవాలి .
రాణా విచారణ ద్వారా 26/11 ఉగ్రదాడుల వెనుక ఉన్న పూర్తి కుట్రను వెలికితీయాలని NIA ఆశిస్తోంది. ఈ విచారణ భారతదేశం న్యాయానికి చేరుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.