
Tamil Nadu: దిండిగల్లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. దిండిగుల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.
మరో 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది.
పోలీసుల కథనం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగాయని వెల్లడించారు.
అగ్ని ప్రమాదం ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రారంభమై, మరికొన్ని క్షణాల్లోనే మొత్తం భవనానికి వ్యాపించింది.
ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారాన్ని చేరవేశారు.
రెండు గంటల పాటు నిరంతర ప్రయత్నాల తరువాత ఫైర్ టెండర్స్ మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ సమయంలో ఆసుపత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.
వివరాలు
50 అంబులెన్సుల సహాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స
ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు, వీరిలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో సుమారు 30 మంది రోగులు ఉన్నారని సిబ్బంది వెల్లడించారు.
గాయపడిన వారిని, అస్వస్థతకు గురైన రోగులను తక్షణమే 50 అంబులెన్సుల సహాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
#TamilNadu : #HospitalFire
— Surya Reddy (@jsuryareddy) December 12, 2024
At least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.
Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh