LOADING...
Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు
400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు

Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. Association for Democratic Reforms (ADR) నివేదిక ప్రకారం 4,023 మందిలో 3,992 మంది అఫిడవిట్లను పరిశీలించగా, 722 మంది (18%) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 400 మందికి పైగా తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. 2021 ఎన్నికల్లో ఇది కేవలం 13% మాత్రమే ఉండగా,ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్షపడే కేసులు,నాన్-బెయిలబుల్ కేసులు, ప్రభుత్వానికి నష్టం కలిగించే కేసులను ADR తీవ్రమైన నేరాలుగా పరిగణించింది. హత్య,దాడి,కిడ్నాప్,అత్యాచారం,మహిళలపై నేరాలు,అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఇందులో ఉన్నాయి.

వివరాలు 

అభ్యర్థుల ఆస్తుల విషయంలో భారీ పెరుగుదల

ప్రధాన పార్టీలలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) అభ్యర్థుల్లో 69% మందికి కేసులు ఉన్నట్లు తేలింది. ఇక అభ్యర్థుల ఆస్తుల విషయంలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. సగటు ఆస్తులు ₹1.72 కోట్ల నుంచి ₹5.17 కోట్లకు పెరిగాయి. మొత్తం 981 మంది అభ్యర్థులు ₹1 కోటి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా, AIADMKకి చెందిన లీమారోస్ మార్టిన్ ₹5,863 కోట్లకు పైగా ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. తరువాత సి జోసెఫ్ విజయ్ ₹648 కోట్లకు పైగా ఆస్తులతో నిలిచారు.

వివరాలు 

మొత్తం అభ్యర్థుల ఆస్తులు ₹20,678 కోట్లు 

2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి స్పష్టమైన కారణాలు చెప్పాలని చెప్పినా, రాజకీయ పార్టీలు ఇంకా అదే పద్ధతిని కొనసాగిస్తున్నాయని ADR పేర్కొంది. గెలిచే అవకాశాలనే ప్రాధాన్యంగా తీసుకుంటూ శుభ్రమైన రికార్డు కంటే డబ్బు, ప్రభావాన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం అభ్యర్థుల ఆస్తులు ₹20,678 కోట్లకు చేరడం కూడా రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత పెరిగిందో చూపిస్తోంది.

Advertisement