NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 
    తదుపరి వార్తా కథనం
    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 
    ఎస్సీ భూముల్లో మట్టి తవ్వుతున్న వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్

    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.

    అక్కడ అక్రమాలు చేసేది ఎవరో కాదని, వైకాపా ప్రజా ప్రతినిధులే ఈ అక్రమ మట్టి తవ్వకాల్లో పాలుపంచుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

    ఓ పక్క దౌర్జన్యాలు చేస్తూనే మరోపక్కఅక్రమాలపై తమ హక్కుల కోసం నిరసిస్తున్న ఎస్సీలపై దాడులు చేస్తున్న నిందితులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.

    ఏనుగువానిలంక గ్రామంలో చించినాడ గ్రామ దళితులకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ భూములను కేటాయించింది. అయితే దాదాపు 60 ఏళ్లుగా ఆ భూములను ఎస్సీలే సాగు చేసుకుంటున్నారు.

    DETAILS

    పోలీసులు అధికార పార్టీకి గూండాల్లా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

    ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో వైకాపా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ పాగా వేశారని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

    అనంతరం ఆయా భూముల్లో నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ దాష్టీకాలపై ఈనెల 6న చించినాడ ఎస్సీలు నిరసనకు దిగారని, న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై లాఠీని ఝులిపించారని ఫైర్ అయ్యారు.

    ఒక పక్క తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న ఎస్సీలను, సమీపంలోని పాలకొల్లు ఆస్పత్రికి కాకుండా దాదాపుగా 70 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న తాడేపల్లిగూడేనికి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి గూండాల్లా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్ నంద్యాల
    జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ జనసేన
    ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు  విద్యా శాఖ మంత్రి
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025