NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
    తదుపరి వార్తా కథనం
    'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
    ఏపీలో హింస, నిరంకుశంపై చంద్రబాబు ఆందోళన

    'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 13, 2023
    02:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెలకొన్న హింస, అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.

    తనపై జరిగిన దాడులపై సీబీఐ(CBI)తో విచారణకు ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడులు జరుగుతున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

    రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను ఉద్దేశపూర్వంగా విధ్వంసం చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు చంద్రబాబు వివరించారు.

    DETAILS

    75 పేజీల లేఖ పంపించిన చంద్రబాబు

    ఏపీలోని విపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

    2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక విధ్వంసక పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రజా వేదికను కూల్చేయడంతో పాటు ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేసినట్లు చెప్పారు.

    2019 ఆగస్ట్ నుంచి ఇటీవలే అంగళ్లులో జరిగిన ఘటన వరకు తనపై అనేక దాడులు జరిగాయన్నారు. ఆయా ఘటనలకు సంబంధించి 75 పేజీల సారాంశాన్ని, దానికి సంబంధించిన వీడియోలను చంద్రబాబు లేఖకు జత చేశారు.

    నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందటూ చంద్రబాబు లేఖలో వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన గన్నవరం
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు గన్నవరం

    ఆంధ్రప్రదేశ్

    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  భారీ వర్షాలు
    మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య భారతదేశం
    ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు పవన్ కళ్యాణ్
    వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్ పవన్ కళ్యాణ్

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025