NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
    అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు

    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.

    వెంటనే పారామిలిటరీ దళం (అస్సాం రైఫిల్స్‌)ను రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవాలని దాదాపు 40 మంది మైతీ ఎమ్మెల్యేలు కోరారు.

    మణిపూర్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణ, స్థిరత్వాన్ని సాధించుకునేందుకు రాష్ట్ర భద్రతా దళాలు, విశ్వసనీయమైన కేంద్ర బలగాలను పంపించాలని అభ్యర్థించారు.

    మరోవైపు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 10 మంది కుకీ ఎమ్మెల్యేలు సైతం ప్రధానికి లేఖ రాశారు. అస్సాం రైఫిల్స్‌ను యథాతధంగా కొనసాగించాలని, వాటిని తొలగించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

    DETAILS

    అస్సాం రైఫిల్స్  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు: కుకీ ఎమ్మెల్యేలు

    కుకీ,మైతీ వర్గాల మధ్య బఫర్ జోన్ సృష్టించేందుకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నట్లు గిరిజనులు వర్గ(కుకీ)ఎమ్మెల్యేలు తెలిపారు.

    భారత్ లోనే అతిపురాతన దళం, అస్సాం రైఫిల్స్ ఆవిర్భావం నుంచి దేశ అంతర్గత రక్షణకు, బాహ్య రక్షణకు కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్, BSF, ITBP, RAF, CRPF తదితర కేంద్ర బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నట్లు కుకీలు వివరించారు.

    రాష్ట్రంలోని హింసకాండను కట్టడి చేసేందుకు కేంద్రం అస్సాం రైఫిల్స్‌ను మోహరించింది. మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కుకీలు ఆందోళన బాట పట్టారు.దీంతో 3 నెలలకు పైగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    మణిపూర్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ప్రధాన మంత్రి

    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వం
    డిస్పోసబుల్ పెన్ను వివాదంలో బ్రిటన్ ప్రధాని.. దస్త్రాలపై అదే పెన్నుతో సునక్ సంతకాలు  రిషి సునక్
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం
    నల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ   భారతదేశం
    అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్  ఫ్రాన్స్
    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ ఫ్రాన్స్
    యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు  ప్రధాన మంత్రి

    మణిపూర్

    మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు సుప్రీంకోర్టు
    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం  నాగాలాండ్
    మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి ప్రభుత్వం
    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025