NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం
    మీడియాను గుప్పిట పట్టిన కేంద్రం, రాహుల్ ఫైర్

    కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    ద్వారా సవరించబడింది Sirish Praharaju
    Aug 11, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    దిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ తీవ్రంగా స్పందించారు.

    దేశంలోని మీడియా కేంద్రం నియంత్రణలోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ)టీవీలను సైతం కేంద్రం తన గుప్పిట్లో బిగించిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

    అయినప్పటికీ తన పనిని తాను యథావిధిగా చేసుకుపోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడైతే భరతమాత మీద దాష్టీకాలు, అఘాయిత్యాలు జరుగుతాయో అక్కడ తాను ప్రత్యక్షమవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు భరతమాతను కాపాడుకుంటానని అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     భరతమాతను కాపాడుకుంటా: రాహుల్ గాంధీ 

    #WATCH | Congress MP Rahul Gandhi says, "...I know media is under control, Rajya Sabha, Lok Sabha TV is under control but I am doing my work and will continue to do it. Wherever 'Bharat Mata' will be attacked, you will find me present there and protecting the Bharat Mata." pic.twitter.com/amK1D7ztPt

    — ANI (@ANI) August 11, 2023

    Details 

    ఎందరో ప్రధానులను చూశాను,దిగజారి మాట్లాడిన ప్రధానిని మాత్రం చూడలేదు: రాహుల్

    మణిపూర్ రాష్ట్రం ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో అట్టుడుకుతుంటే, మరోవైపు పార్లమెంట్‌లో ప్రధాని నవ్వుతూ, జోకులు వేశారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    గతంలో ఎందరో ప్రధానులను చూశానని, ఇలా దిగజారి మాట్లాడిన ప్రధానిని తాను చూడలేదన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడిన తీరును రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు.

    గురువారం లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. కానీ మణిపుర్‌ అంశంపై మాత్రం కేవలం 2 నిమిషాలే మాట్లాడారని రాహుల్ గుర్తు చేశారు.

    ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ నేతగా మాట్లాడకూడదని, దేశంలోని ప్రజలందరికీ ప్రధానే ప్రతినిధి అని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మణిపూర్ మండుతుంటే ప్రధాని జోకులు వేస్తున్నారు : రాహుల్

    On Manipur violence, Congress MP Rahul Gandhi says, "Indian Army can stop this drama in 2 days but PM wants to burn Manipur and does not want to extinguish the fire." pic.twitter.com/IkAAG1b1M0

    — ANI (@ANI) August 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    రాహుల్ గాంధీ

    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  దిల్లీ
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025