AP assembly budget sessions: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సాగునీటి ప్రాజెక్టుల జాప్యం ఫలితంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపుతూ ఈ అంశంపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
ఫ్లెక్సీలు,ప్లకార్డులతో నిరసన చేసిన టిడిపి
అయితే స్పీకర్ తమ్మినేని వాయిదా తీర్మానాలను కొట్టివేసి సభ సాధారణ కార్యక్రమాలను కొనసాగించారు. మూడోరోజు సమావేశాలు ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులుఆందోళనకు దిగడంతో సభ నుంచి ఒకరోజు పాటు స్పీకర్ వారిని సప్పెండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేశారు.