NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
    తదుపరి వార్తా కథనం
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 07, 2023
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వైవీబీ అస్వస్థతను గమనించిన కుటంబసభ్యులు, హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

    ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. స్పందించిన డాక్టర్ల బృందం, రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి ప్రాణా పాయం లేదని చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. యాంజియోగ్రామ్‌ అనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు స్పష్టం చేశారు.

    అయితే ఏపీ స్థానిక సంస్థల అభివృద్ధికి వైవీబీ రాజేంద్రప్రసాద్ విశేష కృషి చేశారు. దీంతో పాటు లోకల్ ప్రజా ప్రతినిధులకు విధులు, నిధులు, అధికారాల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారనే పేరు సంపాదించుకున్నారు.

    Tdp Senior Leader Yvb Rajendra Prasad Suffers Heart Attack

    నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరు ప్రతిష్టలు

    వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ నిబద్ధత కలిగిన నాయకుడిగా ఏపీ పాలిటిక్స్ లో కీర్తి గడించారు. 2021 జనవరి నాటికి రాజేంద్ర ప్రసాద్‌ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గమనార్హం.

    స్వాతంత్ర్య దినోత్సవం రోజు పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా వందనం చేయించాలని అప్పట్లో ఏపీ సర్కార్, ఉత్తర్వులు జారీ చేసింది.

    దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ లోకల్ బాడీ ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలే జాతీయ జెండాను ఎగురవేయాలని పోరాడారు.

    ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని, పంచాయతీ హక్కులను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ మేరకు సర్కార్ జీవోలను తప్పుపడుతూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి విద్యా శాఖ మంత్రి
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  కూరగాయలు
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025