
Air India Express: విమానంలో సాంకేతిక సమస్య.. రన్వేపై నిలిచిపోయిన ఎయిరిండియా విమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి చెందిన ఓ విమానంలో టేకాఫ్కు ముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటసేపు ప్రయాణం ఆలస్యం కాగా, ఈ సమస్యను రన్వేపైనే గుర్తించి చర్యలు తీసుకున్నారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే విమానాన్ని నిలిపివేశారు.
వివరాల్లోకి వెళితే... ఐఎక్స్ 1511 నంబర్తో కూడిన విమానం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి పశ్చిమబెంగాల్లోని కోల్కతాకు బయలుదేరాల్సి ఉంది.
అయితే టేకాఫ్కి కొద్ది క్షణాల ముందు సాంకేతిక లోపం వెల్లడైంది. ఇది గుర్తించిన సిబ్బంది విమానాన్ని స్టాండ్స్టిల్ చేశారు.
టేకాఫ్కు కొద్దిసేపటికి ముందు సమస్యను గుర్తించామని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అధికార ప్రతినిధి చెప్పారు.
అవసరమైన వారికి రీషెడ్యూలింగ్ లేదా రీఫండ్ సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Details
విషాదాన్ని మిగిల్చిన AI-171 విమానం
ఇక ఇదే సందర్భంలో.. ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం (AI-171) విషాదం మిగిల్చిన సంగతి మరచిపోలేం.
టేకాఫ్ అయిన కొద్ది సమయానికే మేఘాని నగర్ ప్రాంతంలోని ఘోడాసర్ క్యాంప్లో కూలిపోయిన ఆ ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర ప్రమాదానికి విచారణ కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంపెనీ సమగ్ర తనిఖీలు చేపడుతోంది.
తాజా సాంకేతిక లోపం కూడా అదే తనిఖీల క్రమంలోనే గుర్తించబడినదని తెలుస్తోంది.