NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
    భారతదేశం

    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా

    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 19, 2023, 12:01 pm 0 నిమి చదవండి
    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
    7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ డ్రామా

    మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామ శివార్లలోని కొండగట్టులో కారు దగ్ధమై, ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోలేదని రూ. 7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ మర్డర్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న ధర్మానాయక్ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటు పడి రూ.కోట్లలో అప్పుల పాలయ్యాడు. పథకం ప్రకారం, గతేడాది రూ.7.4కోట్ల విలువైన 25 బీమా పాలసీలను తీసుకున్నాడు. బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు ఈనెల 9న కొండగట్టు వద్ద కారులో ఓ వ్యక్తిని తగలబెట్టి, తానే చనిపోయినట్లు సనీఫక్కీలో భారీ మోసానికి ధర్మానాయక్ తెరలేపాడు. దీనికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

    మరి కారులో చనిపోయింది ఎవరు? పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి

    ధర్మానాయక్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అతని పేరిట భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలిసీలు ఉన్నట్లు తెలిసింది. ఈక్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు ధర్మానాయక్ భార్య ఫోన్‌ను ట్యాప్ చేశారు. కొన్ని రోజుల తర్వాత పుణె నుంచి ధర్మానాయక్ భార్యకు ఫోన్ వచ్చినట్లు పోలీసుల గుర్తించారు. ఆ కాల్ డేటాను విశ్లేషించగా, అతను ధర్మానాయక్ అనే షాకింగ్ విషయం తెలిసింది. అనంతరం ధర్మానాయక్‌‌తోపాటు అతని భార్య, ఇద్దరు బంధువులతో పాటు మరో నలుగురిని అధికారికంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియనని వ్యక్తిని బంధువుల సాయంతో హత్య చేసి, కారులో కూర్చొబెట్టి, అనంతరం వాహనంపై పెట్రోల్ పోసి కాలబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలంగాణ

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    తెలంగాణ

    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి
    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు భారతదేశం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023