Page Loader
TG Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే?
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే?

TG Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించేందుకు ఉదయం 10 గంటలకు సభను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆయన కీలక పాత్రను వివరించేలా ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సేవల గురించి మాట్లాడనున్నారు.

Details

సభ నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు

సంతాప తీర్మానం ఆమోదించిన అనంతరం అసెంబ్లీ వాయిదా వేయనున్నారు. అదే సమయంలో సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహాచార్యులు ఆదివారం నాడే పరిశీలించారు. సభ నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ అసెంబ్లీ సిబ్బందికి సూచించారు.