NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
    సంక్షేమంలో తెలంగాణ భేష్: గవర్నర్ తమిళసై

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.

    గవర్నర్ తమిళసై తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రగతిని వివరించారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందుందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యవసాయంలో గణనీయమైన ప్రగతిని తెలంగాణ సాధించినట్లు ఆమె చెప్పారు.

    కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు గవర్నర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అములు చేస్తున్న రైతు బంధు పథం ప్రంపచం దృష్టి ఆకర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు 24గంటలు విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం సఫళీకృతమైనట్లు ఆమె వెల్లడించారు.

    దళిత బంధు విప్లవాత్మకమైన పథకమని, ఇందులో భాగంగా ప్రతి దళితుడికి రూ.10లక్షల చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు.

    గవర్నర్

    పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ: గవర్నర్

    పారిశ్రామికంగా తెలంగాణ విశేష అభివృద్ధిని సాధిస్తున్నట్లు గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. అగ్రశ్రేణి కంపెనీలు, బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించడంలోనూ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని కితాబిచ్చారు.

    పేదలకు చేయూతగా ఆసరా పథకాలన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. అంతేకాతు ఆసరా పథకం లబ్ధిదారుడి వయసు 57కు తగ్గించినట్లు ఆమె వెల్లడించారు.

    తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు పెంచినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా రూ.11వేల కోట్లతో 7.3లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ మాంసం ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచినట్లు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గవర్నర్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025